Saturday, July 27, 2024
Additional Class Rooms: ఆ పాఠశాలల్లోఅదనపు గదులు

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Additional Class Rooms: ఆ పాఠశాలల్లోఅదనపు గదులు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • తరగతులు విలీనమైనచోట నిర్మాణాలు

నూతన విద్యావిధానం అమలులో భాగంగా 3,4,5 తరగతులను కలిపిన ఉన్నత పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో ఎక్కడ ఎంతమంది విద్యార్థులున్నారు? ఎన్ని గదులు నిర్మించాలనే నివేదిక సిద్ధం చేసి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించారు. గురువారం విజయవాడలో ప్రాథమిక విద్య కమిషనర్‌ సమీక్ష నిర్వహించగా జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్, ఏపీసీ శ్రీనివాసులు హాజరయ్యారు.

198 ఉన్నత పాఠశాలల్లో విలీనం..

216 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను 250 మీటర్ల పరిధిలోగల 198 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. వారికి ఇకపై సబ్జెక్టు టీచర్లు బోధిస్తారు. 380 మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నత పాఠశాలల్లో చేరారు. వారంతా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు అయినప్పటికీ విద్యార్హతలను బట్టి ఆయా సబ్జెక్టులు బోధించాలని ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా కొరత ఉంటే త్వరలో పదోన్నతులు నిర్వహించి ఎస్జీటీల్లో అర్హులైన వారికి స్కూలు అసిస్టెంట్లుగా నియమిస్తారు. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే పదోన్నతులు చేపడతారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సమయాలు కూడా ఉన్నత పాఠశాల మాదిరిగానే అమలు చేయాలని స్పష్టత ఇచ్చారు.

ప్రత్యేక నిధుల కేటాయింపు:

తరగతులు విలీనమైన ఉన్నతపాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాడు-నేడుతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారు. వసతి గృహాలు ఉన్న జిల్లాలోని ఆరు మోడల్‌ పాఠశాలల్లో ఆగస్టు నుంచి పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించడానికి సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles