Saturday, July 27, 2024
Timings Change: ఉద్యోగుల పని వేళలు మార్పు

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Timings Change: ఉద్యోగుల పని వేళలు మార్పు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • జూన్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు…

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు జూన్ 10 నుంచి మారబోతున్నాయి. కర్ఫ్యూ సమయాల్లో మార్పు కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వద్ద సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూ సమయాలు మార్చాలని నిర్ణయించారు. కరోనా కేసుల్లో కొంత తగ్గుదల ఉండటంతో జూన్ 10 నుంచి తదుపరి నిర్ణయం తీసుకునే వరకు సడలింపు వేళలు మార్చారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. అది జూన్ 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసు వేళలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారు డ్యూటీలు చేయవలసి ఉంటుంది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇవే వేళలు అమల్లో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles