Spouse Case: ఉపాధ్యాయ బదిలీలు-2020 లో స్పౌజ్ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దుర్వినియోగం రుజువు కావడం తో రెండు ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం లో పని చేస్తున్న ఉపాధ్యాయిని స్పౌజ్ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్నట్టు ఆరోపణలు రావడం తో అసిస్టెంట్ డైరెక్టర్ నేత్రుత్వం లో విచారణ చేపట్టారు. సదరు విచారణ లో స్పౌజ్ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్నట్లు రుజువు కావడం తో రెండు ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ డిఈఓ ఎం.సాయిరాం ఉత్తర్వులు జారీ చేసారు.