Trending

6/trending/recent

Danger Bells: 470 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ !

Corona Positive to Childrens: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 470 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు.  వీరంతా పదేళ్లలోపే వారే కావడం గమనార్హం. ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు కరోనా మహమ్మారి బారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతంలో రోజుకు 8 నుంచి 9 మంది చిన్నారులు వైరస్‌ బారినపడేవారు. ఇప్పుడు వారి సంఖ్య 46 కు చేరుకుంది. ఇంకా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  కాగా.. దేశంలో  గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 62,714 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కి చేరింది.  ఇందులో 1,13,23,762 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,86,310 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 312 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,552కి చేరింది. 


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad