- బదిలీల దరఖాస్తు గడువు తేదీ పెంచేది లేదు
- ఆదివారం ఉదయానికి దాదాపు 30,000 బదిలీ దరఖాస్తులు సమర్పణ
అమరావతి, న్యూస్ టోన్: ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువు షెడ్యూల్ ప్రకారం రేపటి తో (సోమవారం తో) ముగియనుంది. ఇప్పటికే దాదాపు 30,000 వేలమంది ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేశారు. ఈ దరఖాస్తు గడువు తేదీ పెంచేది లేదని అడిషనల్ డైరెక్టర్ శ్రీ దేవానంద రెడ్డి స్పష్టం చేశారు. తప్పనిసరి బదిలీ అవ్వాల్సిన ఉపాధ్యాయులు, బదిలీ అభ్యర్ధన కోరే ఉపాధ్యాయులు రేపటి లోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.