Trending

6/trending/recent

ప్రతి విద్యా ర్థికి జగనన్న విద్యా కానుక కిట్లు

  • రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రీ సెల్వి

న్యూస్ టోన్, దావాజిగూడెం(గన్నవరం): విద్యా పథకాల అమ లులో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్య ధోరణిపై సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వె ట్రీసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎంపీపీ ఆదర్శ పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, వాటి నాణ్యత, యూనిఫాం కుట్టుకూలీ డబ్బులు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమపై ఆరా తీశారు. కొంత మంది విద్యార్థులు యూనిఫాం, బూట్లు, స్కూల్ బ్యాగ్ లు తీసుకురాక పోవడంతో అందరికీ విద్యాకానుక కిట్లు అందజే యాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు రం ఎంపీపీ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన వెట్రీ సెల్వి విద్యాకానుక కిట్లు పంపిణీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఇళ్ల వద్ద పంపిణీ చేస్తున్న బియ్యం, చిక్కీలు పంపిణీ రికా ర్థులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. ఆమె వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎంవీ రాజ్యలక్ష్మి అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రవీంద్రబాబు, ఎంఈఓ అదూరి వెంకటరత్నం, హెచ్ఎంలు ఎం విజయరామారావు, డి.నవభారతి పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad