Saturday, July 27, 2024
UncategorizedCM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.....

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

CM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ కీలక నిర్ణయం

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

CM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై సీఎం సమీక్ష(Review) నిర్వహించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌ తేవాలని సూచించారు. ఏసీబీకి యాప్‌(ACB App) ద్వారా ఆడియో ఫిర్యాదు చేయొచ్చని సీఎం అన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందేని ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందే. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్‌ తీసుకొస్తాం. నెలరోజుల్లోగా యాప్‌ రూపకల్పన చేసి, ఆడియోనూ ఫిర్యాదుగా పంపించే అవకాశం కల్పిస్తాం. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ చేస్తుంది. డగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండకూడదకు. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

CM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ కీలక నిర్ణయం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles