భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది.
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. భారత టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో రోహిత్ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్గా నియమించారు.
ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా రోహిత్ శర్మను ODI జట్టుకు కెప్టెన్గా నియమించాలని నిర్ణయించిందని బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే 3-టెస్టుల సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మను టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మాయంక్ అగర్వాల్, పుజారా, అజింక్య రహానె, శ్రేయస్స్ అయ్యార్, హనుమ విహరి, రిషబ్ పంత్, వృద్ధమాన్ సాహ, అశ్విన్, జయంత్ యాదవ్, ఇశాంత్ శర్మ, షమి, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాగుర్, సిరాజ్.