Saturday, July 27, 2024
Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.....

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్‌’. జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా సమాజంలో అణగారిన వర్గ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అన్యాయంగా ఓ కేసులో చిక్కుకున్న పేద కుటుంబం తరఫున పోరాడే లాయర్‌ పాత్రలో సూర్య నటించారు. జ్యోతిక దంపతులు సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాను చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘నా హృదయం బరువెక్కింది. రాత్రంతా నిద్రపట్టలేదు’ అంటూ ఓ లేఖను కూడా విడుదల చేయడం విశేషం.

నేనూ ఇలాంటి దారుణాలు చూశాను..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కూడా ‘జై భీమ్‌’ బాగా ట్రెండ్‌ అవుతోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఐఏఎస్‌ అధికారి  గంధం చంద్రుడు వీక్షించారు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సన్ని వేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. జైల్లో కొందరు ఖైదీలను పోలీసులు దారుణంగా హింసించే సన్నివేశం అది. దీనిని చూసిన కలెక్టర్‌ తన జీవితంలోనూ ఇలాంటి దారుణం ఒకటి జరిగిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అప్పటి సంఘటన వివరాలను షేర్‌ చేశారు.. ‘ఇలాంటి సన్నివేశాలు నిజ జీవితంలో చాలా సార్లు జరిగినవే.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లోనే కాదు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి’

‘2011 సంవత్సరంలో మెదక్ జిల్లా పటాన్ చెరువులో ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించాడు. అప్పుడు నేను జిల్లా కలెక్టర్‌ అసిస్టెంట్‌ (ట్రైనీ)గా ఉన్నాను. అండర్ ట్రయల్ ఖైదీ కస్టడీ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి నన్ను మెజిస్టీరియల్ విచారణ అధికారిగా నియమించారు. విచారణంలో భాగంగా.. జైలు, మార్చురీ, ఆస్పత్రిని సందర్శించాను. ఖైదీ మరణానికి బాధ్యులైన పోలీసు సిబ్బందిని విచారించాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాను. ఆ నివేదిక ఆధారంగా ఖైదీ మరణానికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని అప్పటి సంఘటనను గుర్తుకు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles