Saturday, July 27, 2024
Coronavirus: మహారాష్ట్రాలో ఒమిక్రాన్‌ కలకలం..? సౌతాఫ్రిక నుంచి...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Coronavirus: మహారాష్ట్రాలో ఒమిక్రాన్‌ కలకలం..? సౌతాఫ్రిక నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌..

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌గా రూపుమార్చుకున్న ఈ మాయదారి రోగం మరోసారి ప్రపంచంపై దండెత్తడానికి వస్తోంది. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్‌ ప్రపంచానికి పాకేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రాలోని థానే జిల్లాకు చెందిన డోంబివ్లిలో కరోనా కలకలం సృష్టించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా గందరోళ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఒమిక్రాన్‌ వేరియంట్‌ అనడానికి మాత్రం ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. పరీక్షల నిమిత్తం అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి, సదరు వ్యక్తికి క్వారంటైన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ ముప్పు సంక్షోభంగా మారకముందే ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు, అంతర్జాతీయ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ ముందు వరుసలో ఉంది. సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఐరాపా ఖండంలోని కొన్న దేశాలతో పాటు, ఆస్ట్రేలియా కూడా ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.

ఇక ఒమిక్రాన్‌ను నిరోధించే క్రమంలో భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచాలని సూచించారు. అలాగే టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles