Saturday, July 27, 2024
Quality Education: నాణ్యమైన విద్యలో ...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Quality Education: నాణ్యమైన విద్యలో వెనుకబాటు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 19వ స్థానం
  • నీతి ఆయోగ్‌ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ నివేదికలో వెల్లడి

Quality Education: నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే వెనుకబడింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్‌ (2020-21) నివేదికను విడుదల చేసింది. మొత్తం 17 లక్ష్యాలు- సాధించిన పురోగతి ఆధారంగా నివేదికను రూపొందించగా ఇందులో అందరికీ నాణ్యమైన విద్యను అందించడం నాలుగో లక్ష్యంగా నిర్దేశించారు. నాణ్యమైన విద్యకు 11 అంశాల ప్రామాణికంగా స్కోరును కేటాయించారు. ఏపీకి 50 పాయింట్లు వచ్చాయి. గత 2019-2020 నివేదికలో 52 పాయింట్లతో 18వ స్థానంలో నిలవగా.. ఈసారి 19కి పడిపోయింది. నాణ్యమైన విద్యలో 100 పాయింట్లకు కేరళ 80 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బిహార్‌ 29 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.

అక్షరాస్యతలో 27వ స్థానం

15ఏళ్లు, ఆపైబడిన వారి అక్షరాస్యతలో 65.60 శాతంతో రాష్ట్రం 27వ స్థానంలో నిలిచింది. ఇది జాతీయ సరాసరి 74.6 కంటే తక్కువ. బిహార్‌ 64.7 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.  

సెకండరీ స్థాయిలో 9-10 తరగతుల్లో ఏడాదికి బడి మానేస్తున్నవారు రాష్ట్రంలో 16.37 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జాతీయ సరాసరి   17.87 కంటే తక్కువగా ఉన్నా.. జాతీయ స్థాయిలో 14వస్థానంలో నిలిచింది.

స్థూల ప్రవేశాల నిష్పత్తి 11-12 తరగతుల్లో (ఇంటర్మీడియట్‌) 46.84 శాతంగా ఉంది. దేశంలో 17వ స్థానంలో నిలవగా జాతీయ సరాసరి కంటే కొంచెం మెరుగ్గా ఉంది.

ఎనిమిదో తరగతి అభ్యాసనా ఫలితాల్లో 80.2 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నాయి.

సెకండరీ స్థాయి (9-10) తరగతుల విద్యార్థులకు బోధించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 75.18శాతం ఉన్నారు. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువగా ఉంది. దేశంలో ఏపీ 20వ స్థానంలో నిలిచింది.

పాఠశాలల మౌలిక సదుపాయాల్లో జాతీయ స్థాయిలో 13వ స్థానంలో  నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles