Trending

6/trending/recent

Meeting on CPS: కాంట్రాక్టు ఉద్యోగులు, సీపీఎస్ పైనా త్వరలో సమావేశాలు

  • ఎన్ జీ వో నేతలకు చెప్పిన ఉన్నతాధికారి ధనుంజయ్ రెడ్డి

Meeting on CPS: ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు హామీల విషయంలోను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రెండు అంశాల్లోను మంత్రుల బృందం, అధికారుల బృందం నివేదికలు సిద్ధమయ్యాయని తెలిసింది. ఇతర కన్సల్టెన్సీల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా త్వరలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ధనుంజయ్ రెడ్డితోను ఎన్ జీ వో నాయకులు మాట్లాడినట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ పై కూడా త్వరలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించినట్లు ధనుంజయ్ రెడ్డి ఎన్ జీవో నాయకులకు చెప్పారు. బహుశా జులై నెలలో ఈ అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ఎన్ జీ వో అధికారులకు తెలియజేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ 12 రోజులుగా సాగిస్తున్న ఉద్యమం విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. సీపీఎస్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఇటీవల ఉన్నతాధికారులను సంప్రదించిన సందర్భంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ జీ వో సంఘం నాయకులకు కూడా బుధవారం అదే విషయం వెల్లడించారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad