Saturday, July 27, 2024
5G In India: 5జీ నెట్‌వ‌ర్క్ ఆరోగ్యంపై...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

5G In India: 5జీ నెట్‌వ‌ర్క్ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపిస్తుందా..? ఇందులో నిజ‌మేంత‌.. తేల్చి చెప్పిన సీవోఏఐ..

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 5G In India: భార‌త్‌లో 5జీ నెట్‌వ‌ర్క్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న విష‌యం తెలిసిందే. 

అయితే ఈ క్ర‌మంలోనే దీని చుట్టూ గ‌త‌కొన్ని రోజుల‌గా వివాదం చెల‌రేగుతూనే ఉంది. భార‌త్‌లో 5జీ టెక్నాల‌జీ ట్ర‌య‌ల్ ర‌న్ చేయ‌డం వ‌ల్లే క‌రోనా సెకండ్ ఈ రేంజ్‌లో వ్యాపించింద‌ని గ‌తంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిలో ఏ మాత్రం నిజం లేద‌ని నిపుణులు స‌ద‌రు ఫేక్ వార్త‌ల‌ను ఖండించారు.

ఇదిలా ఉంటే తాజాగా 5జీ టెక్నాల‌జీ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది సెల్యులార్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ). ఇది ముమ్మాటికీ త‌ప్పుడు ప్రచార‌మ‌ని తేల్చి చెప్పింది. 5జీ టెక్నాల‌జీ చాలా సుర‌క్షిత‌మైంద‌ని.. అన్ని ఆధారారాలు దీన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయ‌ని తెలిపింది. 5జీ టెక్నాల‌జీ రాక‌తో ఆర్థిక రంగంతో పాటు స‌మాజానికి అనే ప్ర‌యోజ‌నాలు జ‌రుగుతాయ‌ని సీవోఏఐ అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా.. భారత్‌లో టెలికాం రంగంలో విధించిన ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ పరిమితి.. అంతర్జాతీయంగా ఆమోదించిన పరిమాణంలో పదో వంతు మాత్రమేనని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. దేశంలో 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. పిటిషన్‌ లోపభూయిష్టంగా ఉందంటూ ఆమెతో పాటు ఇద్దరు సహ పిటిషనర్లకు రూ.20 లక్షల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్‌ స్వాగతిస్తూ… ఇది వదంతులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles