Corona Warning: ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది.. ఫస్ట్ వేవ్లో కంటే తీవ్రంగా.. కేసులు పెరుగుతున్నాయి.. మరణాలు పెరిగాయి.. ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వైరస్ ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. కానీ, ఇది ఇంతటి అయిపోలేదు.. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. దేశంలో కేవలం కోవిడ్ సెకండ్ వేవ్ను మాత్రమే కాకుండా భవిష్యత్తులో థర్డ్, ఫోర్త్ వేవ్లు కూడా ఉంటాయని.. అందుకు సిద్ధమై ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు సూచించారు గడ్కరీ.. ఇక, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన.. వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాల కొరతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని .. రెమ్డెసివిర్కు పెరుగుతున్న డిమాండ్ రీత్యా ఉత్పత్తిని కూడా పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.