Wednesday, November 27, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Live Army Helicopter Crash Live: ఊటిలో...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

Live Army Helicopter Crash Live: ఊటిలో కూప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌తో సహా 13మంది మృతి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణితో పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలను కోల్పోయారు.

Army Helicopter Crash Live: తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ సతీమణితో పాటు 13 మంది ప్రాణాలను కోల్పోయారు.  త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో రావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య‌, ఏడుగురు ఆర్మీ అధికారులు, ఐదుగురు సిబ్బంది ఉన్న‌ట్లు ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. ఇందులో 11 మంది మృత‌దేహాలను వెలికితీశారు.

కాగా, తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది సిబ్బందిలో 13 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాల గుర్తింపులు DNA పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుందని విశ్వనీయవర్గాల వెల్లడిచాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న బిపీన్ రావత్ సతీమణి మరణించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది.
ఎం ఐ హెలికాఫ్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో 13మంది మరణించినట్లు అనధికారిక వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. నీలగిరి జిల్లా కూనుర్‌ వెల్లింగటన్‌లో సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరుకావడానికి కొయంబత్తూరులోని ఆర్మీ సెంటర్‌ నుంచి హెలికాప్టర్‌లో ప్రయణించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంపై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..

ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా తెలిపింది.

live army helicopter crash live: ఊటిలో కూప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌తో సహా 13మంది మృతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this