పిలల్లు సరిగ్గా భోజనం చేయాలంటే ఫోన్స్, వారు అల్లరి చేయకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్స్.. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మొబైల్స్.. ఇలా ప్రతి ఒక్క పనికి నేటి కాలం పిల్లలు ఫోన్స్పైనే ఆధారపడుతున్నారు. భోజనం చేసే సమయంలోనూ ఫోన్ ముందు పెట్టుకుంటున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. భోజనం చేసే సమయంలో పిల్లలను ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్కు దూరంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
Food Time Mobile Avoiding Tips for Children : పిల్లలు భోజనం చేసేప్పుడు ఫోన్ చూస్తున్నారా.. ఇలా చేస్తే వెంటనే మానేస్తారు..!
ఈ జనరేషన్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్.. పిల్లల స్క్రీన్ టైమ్. పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి రాత్రి బెడ్ ఎక్కేవరకు పిల్లలు.. ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ చూస్తూనే ఉంటారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత.. ఆన్లైన్ క్లాస్ల కారణంగా స్క్రీన్ల ముందు గడిపే సమయం ఇంకా ఎక్కువైంది. అన్నం తినేప్పుడూ ఫోన్ ముందేసుకుని కూర్చుంటారు. అది ముందు లేకపోతే ఒక ముద్దకూడా ముట్టరు. దాన్ని లాక్కుంటే.. తినే అన్నం మానేస్తారు. ఇక వేరే ఆప్షన్ లేక తల్లిదండ్రులు ఏమీ అనరు. పిల్లలను అలా వదిలేయాలా..? లేదా ఫోన్ లాక్కుని భోజనం చేసేప్పుడు పిల్లలని విసిగించాలా వారికి అర్థం కాదు.
చాలా మంది పిల్లలు వారి ఎదురుగా ఫోన్ ఉంటేనే అన్నం ముద్దలు మింగుతారు. భోజనం ఎప్పుడూ శ్రద్ధగా, దాని ధ్యాస పెట్టి చేయాలి. ఫోన్, ట్యాబ్ చూస్తూ పరధ్యానంగా తింటే.. మీ చిన్నారి అతిగా తినేలా చేస్తుంది. స్క్రీన్ చూస్తూ అన్నం తినే అలవాటు చేస్తే.. వారు సొంతంగా తినడం నేర్చుకోరు. ఇది మంచి అలవాటు కాదు. మీ పిల్లలు ఎక్కువ సేపు స్ర్కీన్ చూస్తే మానసికంగా, శారీరకంగా వారిపై చెడు ప్రభావం ఉంటుంది. మీ పిల్లలు భోజనం చేసేప్పుడు వారిని స్క్రీన్కు దూరం పెట్టాలనుకుంటున్నారా.. ! అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
టైమర్ సెట్ చేయండి..
భోజనం చేసేటప్పుడు గాడ్జెట్ డిపెండెన్సీని తగ్గించడానికి.. భోజనం ముగించడానికి టైమర్ని సెట్ చేయడం తెలివైన ఆలోచన. పిల్లలు వారి దృష్టిని మరల్చకుండా.. సమయానికి భోజనం చేయడం నేర్పడానికి ఇది మంచి ఐడియా. పిల్లలు ఎక్కువ సేపు తింటున్నారని గొడవ పడకుండా.. వారికి ఒక సమయ పరిమితి ఇవ్వండి. దానిని రోజూ ఫాలో అవ్వండి. వారికి ఇంత టైమ్లో భోజనం తినాలి అని టార్గెట్ చేస్తే.. ఫోన్ పక్కన పెట్టి టక్కున భోజనం చేస్తారు..
మీ రూల్స్ చెప్పండి..
భోజనం చేసేప్పుడు స్క్రీన్ చూడటం వల్ల వచ్చే.. దష్ప్రభావాలు వాళ్లకి అర్థమయ్యేలా చెప్పండి. మొదట వాళ్లు మారం చేస్తారు. భోజన సమయాన్ని, స్క్రీన్ టైమ్ను ఎందుకు కలపకూడదో చెప్పండి. భోజనం చేసేప్పుడు.. ఎంత శ్రద్థతో తినాలో నేర్పండి. మొబైల్కి అలవాటు పడితే కళ్లకి ఇబ్బందే కాదు మానసిక అనారోగ్యాలూ వస్తున్నాయని, చాటింగులూ షేరింగుల వల్ల కాలం చాలా వృథా అవుతుందని చెప్పండి. ఏదైనా ఉదాహరణలతో చెబితే బాగా అర్థమవుతుంది.
ఏ పరధ్యానమూ వద్దు..
మీరు, మీ పిల్లలు భోజనం చేసేప్పుడు.. స్క్రీన్ సమయం మాత్రమే అడ్డుకాదు... పుస్తకాలు, డిజిటల్ గేమ్స్ కూడా భోజనంపై మీకు ధ్యాస లేకుండా చేస్తాయి. కాబట్టి భోజనం చేసే సమయంలో.. దేనితోనూ కాలక్షేపం చేయకుండా..కేవలం భోజనం మీద దృష్టి పెట్టండి. కాస్త ఆ డిజిటల్ ప్రపంచాన్ని పక్కన పెట్టి.. కొంతసేపు మాట్లాడుకోండి. ఒక వేళ మీ పిల్లలు మాట వినకపోతే.. కొన్ని బొమ్మలు ఇవ్వండి.
నెమ్మది.. నెమ్మదిగా..
నెమ్మెది.. నెమ్మదిగా.. భోజన సమయంలో మీ పిల్లలు ఫోన్ పట్టుకోకుండా చేయండి. భోజనం చేసే సమయంలో కొంత సేపు మాత్రమే.. స్క్రీన్ చూసేలా రూల్ పెట్టండి. రోజూ ఆ టైమ్ తగ్గిస్తూ రండి. క్రమక్రమంగా స్క్రీన్ చూసే సమయం తగ్గుతుంది. ఇలా చేస్తే ఫోన్ కోసం భోజనం సమయంలో మీ పిల్లలు చేసే డ్రామా తగ్గుతుంది.
కలిసి భోజనం చేయండి..
కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయండి. మీ స్కెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒకసారి కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి అలవాటు చేసిన వారు అవుతారు. కలిసి భోజనం చేసేప్పుడు హ్యాపీగా మాట్లాడుకోండి. ఇలా చేస్తే.. మీ పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఫోన్, ట్యాబ్ అవసరం లేదు.. మీ మాటలు వింటూ చక్కగా భోజనం చేస్తారు. ఒక వేళ మీకూ భోజనం చేసే సమయంలో ఫోన్ పట్టుకునే అలవాటు ఉంటే మానుకోండి.
ఎన్నో అనర్థాలు..
స్క్రీన్ని నిరంతరాయంగా, ఏకాగ్రతతో చూడ్డం వల్ల తలనొప్పి, కళ్లు అలసిపోవడం, పొడారి పోవడం, ఎర్రబడి నీరు కారడం వంటివి మొదలవుతాయి. అవే కంటి సమస్యలుగా పరిణమిస్తున్నాయి. వీటి లైట్ వల్ల నిద్ర లేమికి గురవుతున్నారు. వాటి ధ్యాసలో పడి వేళకు తినక పోవడం, లేదా పిజ్జా, బర్గర్ వంటి చిరుతిళ్లకు అలవడటంతో జీవక్రియలు అదుపు తప్పుతున్నాయి. తద్వారా అధికబరువు, షుగర్ వంటి అనారోగ్యాలు వస్తున్నాయి. పెద్ద వారిని అనుసరిస్తూ పిల్లలు కూడా వీటి బారిన పడుతున్నారు.