Trending

6/trending/recent

Tirupati:రోబో సర్వీస్.. ఆర్డర్ చేస్తే క్షణాల్లోనే ఆహారం.. ఆహా.. ఏమి సౌకర్యం..!

రెస్టారెంట్లు కూడా ఇప్పుడు కొత్త కొత్త హంగులతో కష్టమర్లని ఆహ్వానిస్తున్నాయి.. అక్కడే ఏదో ఒక స్పెషల్ లేకపోతే జనాలు కూడా అటువైపు వెళ్లడానికి అంత ఇష్టం చూపించడం లేదు.. దీంతో కష్టమర్ల నాడి పట్టిన ఓ రెస్టారెంట్ ఓనర్ ఏకంగా రోబోలతో సర్వీస్ అందిస్తూ కష్టమర్లని ఆకర్షిస్తున్నారు.

అందమైన ఆడ రోబో సర్వర్లు.. ఫుడ్ ఆర్డర్ చేస్తే క్షణాల్లో ఆహారాన్ని మన ముందుకు తీసుకొస్తాయి. ఈ సరికొత్త రోబో రెస్టారెంట్ ఇప్పుడు తిరుపతి వాసులకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఎయిర్ బై పాస్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రోబో డిన్నర్’, ఇండియాస్ అటానమస్ ఫుడ్ సర్వింగ్ రెస్టారెంట్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిసెంబర్ 8న ప్రారంభించారు. తమ రెస్టారెంట్‌లో ఆహారాన్ని పూర్తి స్థాయిలో రోబోలతో సర్వ్ చేస్తామని ఎం.డి. భరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

కస్టమర్లు టేబుల్‌పై కూర్చొని ట్యాబ్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. క్షణాల్లో ఆహారాన్ని తీసుకొస్తాయి ఈ రోబోలు. ఇలాంటివి మొత్తం 12 రోబోలను తయారు చేయించారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేశారు. ఆహారప్రియులకు కొత్త అనుభూతి కల్పించేందుకు ఇలా చేసినట్లు వివరించారు.

రోబో సర్వీసులు పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. రోబో నేరుగా మన టేబుల్ దగ్గరకి వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తుంటే చాలా బాగుంటుంది. గతంలో ఇలాంటి రెస్టారెంటే ఒంగోలులో కూడా ప్రారంభించారు. కష్టమర్లు కొత్తదనం కోరుకునే కొద్దీ రెస్టారెంట్ల ఓనర్లు కూడా ఇంకొంత కొత్తగా ఆలోచించడం మొదలుపెడుతున్నారు.

Tirupati:రోబో సర్వీస్.. ఆర్డర్ చేస్తే క్షణాల్లోనే ఆహారం.. ఆహా.. ఏమి సౌకర్యం..!


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad