Railway Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇక తాజాగా రైల్వే శాఖలో కూడా భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక తాజాగా కోల్కతా కేంద్రంగా పని చేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా, దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14 వరకు ఉంది. ఇందులో భాగంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారుఖరగ్పూర్, సత్రగచి, చక్రధర్పూర్, టాటా, ఝర్సుగూడ, రాంచీలో పనిచేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:.
- ఎంపిక: అకాడమిక్ మార్కుల ఆధారంగా
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
- అప్లికేషన్ ఫీజు: రూ.100
- దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
- వెబ్సైట్: http://rrcser.co.in/