Trending

6/trending/recent

Prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం..

 రాజమౌళి తెరకెక్కించిన బాహుహలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‍గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్‏తో కూడిన పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా టాప్ డైరెక్టర్స్ అందరూ ప్రభాస్‏తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రభాస్ పేరు వింటే చాలు .. డార్లింగ్ అంటూ గుండెల్లో గుడి కట్టుకుంటారు అభిమానులు. ప్రభాస్‏కు గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ సినిమా అప్టేడ్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా పాట విడుదల తేదీ ప్రకటించి.. టెక్నికల్ సమస్య ఉందని విడుదల ఆలస్యం కావడంతో ఏకంగా పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లారు డార్లింగ్ ఫ్యాన్.

పాన్ ఇండియా స్టార్ అయినా కానీ.. ప్రభాస్.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు ప్రభాస్.ఇటీవల ఆంధ్రప్రదేశ్‏లో వరదలు ముంచేత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు జిల్లాలు వరదల దాటికి తీవ్రంగా నష్టపోయాయి. కాలువలు, నదులు పొంగిపోయాయి. చెట్లు, ఇళ్లూ కూలీపోయి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల దాటికి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన చెక్కును త్వరలోనే సీఎం కార్యాలయానికి పంపనున్నారు.


ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో విక్రమాదిత్యగా కనిపించబోతున్నారు ప్రభాస్..

Prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad