- తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఫలితాలు రేపే
- విడుదల చేయనున్న మంత్రి
- గతంలోనే మార్గదర్శకాలు విడుదల
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఇంటర్ సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్కు పూర్తి మార్కులు ఇవ్వనున్నారు. గతంలో అనుత్తీర్ణులైన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే.