ప్రభుత్వ పరీక్షల విభాగం, సంచాలకులవారు జారీ చేసిన పత్రికా ప్రకటన
2021, ఫిబ్రవరి 22న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షకు హాజరు అయిన విద్యార్థుల వివరములు.. ధృవ పత్రములు పరిశీలనార్థం సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమునకు పంపడం జరిగినది.
కావున విద్యార్థులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమును సంప్రదించి..
★ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
★ కుల దృవీకరణ పత్రం,
★ ఆధార్ కార్డు నకలు,
★ స్టడీ సర్టిఫికేట్,
★ అంగవైకల్యం ఉన్న విద్యార్థులు అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం ..
మొదలగు ధృవపత్రాలను జూన్ 14వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందం సమర్పించవలెను.
ధృవ పత్రములు లేని విద్యార్థుల వివరములు పరిశీలించబడవు