Trending

6/trending/recent

Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో మారుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

 Old Notes: చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి. అసలు బ్యాంకులు ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తాయి.? వేటిని పరిగణలోకి తీసుకుంటాయి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఎలా మార్చవచ్చు?

మీ వద్ద పాత లేదా చిరిగిన నోట్లు ఉంటే, మీరు వాటిని దగ్గరలోని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవచ్చు. మీరు ఇచ్చిన నోట్లకు అదే మొత్తంలో డబ్బు తిరిగి ఇస్తారని మాత్రం అనుకోవద్దు. ప్రతీ నోటును మార్చేందుకు బ్యాంకు కొంత ఛార్జీ వసూలు చేస్తుంది. ఉదాహరణకు.. 2000 రూపాయల నోటు 88 చదరపు సెంటీమీటర్లు అయితే, మీకు పూర్తి డబ్బు లభిస్తుంది. కానీ 44 చదరపు సెం.మీ.లో ఉంటే సగం మొత్తం ఇస్తారు. అలాగే మీరు 200 రూపాయల చిరిగిన నోటు 78 చదరపు సెంటీమీటర్లు అయితే.. మీకు పూర్తి డబ్బు లభిస్తుంది. కానీ 39 చదరపు సెంటీమీటర్ల నోటుకు అయితే.. సగం డబ్బు వస్తుంది.

ఎంత వసూలు చేస్తారు?

మీ దగ్గర రూ. 20 నోట్లు.. రూ. 5 వేల కంటే తక్కువ ఉంటే.. ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ. 5 వేలు దాటితే మాత్రం ఛార్జీ పడుతుంది. 20 కంటే ఎక్కువ నోట్లు ఉంటే, ఒక్కో నోటుపై రెండు రూపాయలు వసూలు చేస్తారు. అంతేకాకుండా జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఒకవేళ రూ. 5 వేల కంటే విలువ ఎక్కువ ఉంటే.. నోట్‌కు రూ.2 నుంచి రూ. 5 చెల్లించాలి.

ఎలాంటి నోట్లు మార్చబడవు..!

పాత, చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చునని ఆర్బీఐ సూచించింది. అయితే, కాలిన లేదా చెదలుపట్టిన నోట్లను మార్చుకోవడం కుదరదని తేల్చింది. అలాగే మీరు ఉద్దేశపూర్వకంగా నోటును చింపినా లేదా కత్తిరించినట్లు బ్యాంక్ అధికారి గుర్తిస్తే, అలాంటి నోట్లను తీసుకోరు అని స్పష్టం చేసింది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad