Trending

6/trending/recent

New Office Timings: మారిన ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు... ఒక్క జిల్లా మినహా...

  • సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు
  • తూర్పుగోదావరి జిల్లా మినహా

Office Timings: ఆంద్రప్రదేశ్ లో జూన్ 21 నుంచి ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. తాజా గా రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సవరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు పని చేయాలని, ఉద్యోగులు అవే వేళల్లో విధులకు హాజరు కావాలని తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఆ లోపు ఉద్యోగులు ఇళ్లకు చేరేందుకు వీలుగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

తూర్పుగోదావరి జిల్లాలో కర్ఫ్యూ వేళలు సవరించనందున అక్కడి ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం హాజరవుతున్న వేళల్లోనే విధులకు హాజరు కావచ్చని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తూర్పుగోదావరి ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

Download Orders



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad