- 41 ప్రాథమిక పాఠశాలలు మినహా మిగతా వారందరికీ దూరాభారమే
- 3, 4, 5 తరగతుల పిల్లలకు తిప్పలు
- జిల్లాలో నూతన విద్యా విధానం ప్రతిపాదనలపై స్కూళ్ల మ్యాపింగ్
ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10: రాష్ట్రంలో మూడం చెల విద్యా విధానంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టదలచి న నూతన విద్యా విధానం ప్రతిపాదనల కార్యరూ పంపై జిల్లా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా ప్రాఽథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతు లను సమీప ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు తరలిం చాలన్న ప్రతిపాదనలపై అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండ డంతో ఆ మేరకు జిల్లాలో ప్రభావం పడే పాఠ శాలలపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో హైస్కూలు ప్రాంగణంలోనే 41 ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉన్న ఆవరణలోనే ఐదు ప్రాధమిక పాఠశాలలు ఉన్నట్టు గుర్తించారు. ఇలా ఒకే ప్రాంగణంలోనే హైస్కూలు /యూపి స్కూలు ఉన్న చోట ప్రాధమిక పాఠశాలలు కూడా ఉండడం వలన 3, 4, 5 తరగతులు తరలించినా సంబంధిత విద్యార్థులకు దూరాభారం కాబోదని నిర్ధారణకు వచ్చారు. వీటితోపాటు గిరిజన, మునిసిపల్ పాఠశాలల మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. ఆ ప్రకారం ప్రభుత్వ ప్రతిపాదనలను అమలు చేయాల్సి వస్తే జిల్లాలో సుమారు 2 వేల 400 ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 80 వేల మందికిపైగా 3, 4,5 తరగతులు చదివే పిల్లలు కనిష్టంగా మూడు కిలోమీటర్లు, గరిష్టంగా ఆరు కిలోమీటర్ల దూరంలోని యూపి/ హైస్కూళ్ళకు వెళ్ళాల్సి ఉంటుందని భావిస్తు న్నారు. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితర డెల్టా మండలాల్లో ప్రాధమిక పాఠశా లలకు, ప్రాధమికోన్నత/ఉన్నత పాఠశా లలకు మధ్య 5–6 కిలోమీటర్ల దూరం ఉందని గుర్తించారు. ఈ క్రమంలో నూతన విద్యా విధా నాన్ని ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం పట్టుబడితే తొలుత ఎటువైపు నుంచీ ప్రతిఘటనలు రాకోకుండా, విద్యార్థులకు నష్టం కలుగకుండా ఉండేందుకు మధ్యే మార్గంగా ప్రస్తుతానికి యూపి/హైస్కూల్ ప్రాంగణంలోనే నిర్వహి స్తోన్న ప్రాధమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించి అక్కడే నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకా శాలు ఉండవని భావిస్తున్నారు. దీంతోపాటే పూర్వ ప్రాధమిక విద్య పిపి–1, 2, ప్రిపరేటరీ–1 తరగతులను ప్రాధమిక పాఠశాలల్లోనే నిర్వహించేలా అవసరమైనన్ని నూతన తరగతి గదులు నిర్మించవచ్చునని సమాచారం.