- ఈ ఏడాది నుంచే అమలు
- ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు సీఎంకు చెబుతాం
- సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి సురేష్ వెల్లడి
NEP Meeting: కొత్త విద్యావిధానంపై ఈ ఏడాది నుంచే ముందుకు వెళ్తామని నిర్వహించిన సమావేశంలో వారు ఈ విషయం స్పష్టం చేశారు. విద్యామంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు దీని వల్ల ఎలాంటి నష్టం కలగబోదని భరోసా ఇచ్చారు. ఒక్క స్కూలు కూడా మూతపడబోదని అన్నారు. అన్ని రిజిష్టరు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కొత్త విద్యావిధానంపై తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రాథమిక విద్యను ఇప్పుడు ఉన్నట్లే యథాతథంగా కొనసాగించాలని అనేక సంఘాలు మంత్రికి, సలహాదారులు సజ్జలకు విన్నవించాయి. ఉపాధ్యాయుల ఆందోళనలను వారు కాదంటూనే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. ఆయన సూచనల మేరకు అవసరమైన మార్పులు ఏమైనా ఉంటే చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో గురువారం వెలగపూడి సచివాలయంలో చెప్పారు.