Cluster Fig: మన దేశంలో సీజనల్ ఫ్రూట్స్ అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అత్తి పండ్లలో ఎన్నో ఔషద లక్షణాలు ఉండడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది. ఈ పండ్లు కడుపులో నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు.. గ్యా్స్ సమస్యను కూడా తొలగిస్తాయి.
అలాగే డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చు. ఈ పండ్ల తొక్కలను ఆరబెట్టి.. పొడి చేసి.. అందులో కాస్త చక్కెర, ఆవు పాలు కలిపి తీసుకోవడం వలన డయాబెటిస్ సమస్యను నియంత్రించవచ్చు. అయితే దీనిని ఉదయం, సాయంత్రం 6-6 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అలాగే శరీరానికి తగిలిన గాయాలను నయం చేయడానికి సహయపడుతుంది. గాయంపై ఈ చెట్టు పాలను రాస్తే.. గాయం తగ్గుతుంది. అంతేకాకుండా.. ముక్కు నుంచి రక్తస్రావం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడను నీటిలో మెత్తగా చేసి అంగిలి మీద రాయండి. ముక్కు నుంచి రక్తస్రావం సమస్య ఆగిపోతుంది.
ఎండిన అత్తి పండ్ల పొడిని రోజూ పది గ్రాములు తీసుకుంటే బలహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా.. మహిళల ల్యుకోరియా వ్యాధిని నయం చేయడానికి ఈ అత్తి పండ్ల జ్యూస్ తాగడం మంచిది. ఇందుకోసం ఐదు గ్రాముల గులార్ పండ్ల జ్యూస్ లో కాస్తా చెక్కెర కలిపి తీసుకోవచ్చు. అతిసారం సమస్య ఉంటే, పేస్ట్లో నాలుగైదు చుక్కల సైకామోర్ పాలను జోడించి, రోజుకు మూడుసార్లు తినడం చాలా ఉపశమనం కలిగిస్తుంది.