SSC, Inter Examinations :అమరావతి: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్తో కలిసి పర్యావరణ దినోత్సవం సందర్భంగా సురేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
AP News: పరీక్షలు నిర్వహించి తీరుతాం: మంత్రి ఆదిమూలపు సురేష్
June 05, 2021
0
Tags