Trending

6/trending/recent

Andhrapradesh: కొన్ని నెలలుగా ఆ టీచర్‌ స్కూల్‌కు వెళ్లలేదు.. అధికారుల మెమో, ఇంత‌లోనే..

Anganwadi Teacher Suicide: చిన్న, చిన్న కార‌ణాల‌తో క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు కొంద‌రు. తాజాగా ఓ అంగన్‌వాడీ టీచర్‌ అధికారులు మెమో ఇచ్చారని త‌నువు చాలించింది.

చిన్న, చిన్న కార‌ణాల‌తో క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు కొంద‌రు. తాజాగా ఓ అంగన్‌వాడీ టీచర్‌ అధికారులు మెమో ఇచ్చారని త‌నువు చాలించింది. గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జ‌రిగింది. స్థానిక‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా వినుకొండ మండలం జద్దవారిపాలెంకు చెందిన మేరి కుమారి (40) అంగన్‌వాడీ టీచర్‌గా వ‌ర్క్ చేస్తుంది. ఆమె భర్త లింగారావు చర్చిలో మ‌త బోధ‌కుడిగా పని చేస్తున్నారు. లింగారావు మొదటి భార్య చ‌నిపోవ‌డంతో.. మేరి కుమారిని ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మేరి కుమారికి చిన్నతనం నుంచి మూర్ఛ వ్యాధి ఉంది. ఈ క్ర‌మంలో గత కొన్ని నెలలుగా.. వివిధ కార‌ణాల వ‌ల్ల‌ ఆమె విధులకు వెళ్లలేదు. దీంతో అధికారులు ఆమెకు మెమో ఇష్యూ చేశారు. దీని వల్ల ఆమె మ‌న‌స్తాపానికి గురయ్యారు.

ఈ క్ర‌మంలో మేరి కుమారి గుంటూరులోని భారత్‌పేటలో నివాసం ఉంటన్న సోద‌రి లోకేశ్వరి వద్దకు 10 రోజుల క్రితం వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని బంధువులు భర్తకు తెలియజేయగా.. ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad