1 Crore Ex-Gratia: కోవిడ్ విధుల్లో మరణించిన ఉద్యోగి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..
కోవిడ్ విధుల్లో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల ఒక కోటి రూపాయలు చెల్లించింది. గత సంవత్సరం 2020 జూన్ నెల 7వ తేదీన శ్రీ షివొజీ మిశ్రా అనే ఉపాధ్యాయుడు కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వ కాబినేట్ నిర్ణయం ప్రకారం ఆ ఉద్యోగి భార్య శ్రీమతి సరోజ్ మిశ్రా కు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.