Trending

6/trending/recent

Covid 19 Vaccine: కరోనా నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ సరిపోదా.. మూడో డోసు తీసుకోవల్సిందేనా..?

Bharat Biotech Covaxin: దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోంది. రోజుకు 3 లక్షలకు మించి కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా భావిస్తోన్న వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. తొలి రెండు దశల్లో ఫ్రంట్​ లైన్​ వారియర్స్​, 45 ఏళ్ల పైబడిన వారికి వాక్సిన్​ ఇస్తోన్న ప్రభుత్వం.. మే 1 నుంచి ప్రారంభంకానున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. మరో నాలుగు రోజుల్లో మూడో దశ వ్యాక్సిన్​ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దశలో అనేక మార్పులు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రెండు సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే, తీసుకోని వారి ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో మూడో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకోవాలా? అన్న ప్రశ్నపై ఆరోగ్య నిపుణులు చర్చ మొదలవుతోంది. మూడోసారి వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌-19ను సమర్థంగా నియంత్రించవచ్చన్న అంశంపై పూర్తి అధ్యయనం జరపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.

అయితే, క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ప‌లు విష‌యాలు ఇటీవ‌లి కాలంలో ఇంట‌ర్‌నెట్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇందులో కొన్ని నిజాలు కాగా చాలా అంశాలు నిరాధార‌మైన‌వే. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఈ రాకాసి వైర‌స్‌కు సంబంధించిన తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. క‌రోనా వైర‌స్‌కు సంబంధించి వివిధ ప‌రిశోధ‌నాంశాల‌ను విశ్లేషిస్తూ దీనికి సంబంధించి మ‌రిన్ని అంశాల‌ను వెల్లడించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్న వారికి ఈ ఏడాదిలో మరో బూస్టర్‌ అవసరమని కంపెనీలు ప్రకటించాయి. అంతేకాదు, కరోనాపై సమర్థంగా పనిచేసే వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ఏటా ఒక డోస్‌ తీసుకోవాలని సూచిస్తున్నాయి. కాగా, ఈ నెల ప్రారంభంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)సూచన మేరకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను కొందరు వాలంటీర్లకు మూడో డోస్‌ కింద ఇచ్చారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కొవిషీల్డ్‌ లేదా కొవాగ్జిన్‌లు ఎనిమిది వారాల విరామంతో రెండు డోస్‌లు ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత మరో బూస్టర్‌ డోస్‌ అవసరమని భారత్‌ బయోటెక్‌ ప్రతిపాదించింది.

అయితే, మూడో డోస్‌ తీసుకుంటే కరోనాను సమర్థంగా ఎదుర్కొంటామా? అన్నదానిపై మరింత అధ్యయనం చేయాల్సిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ పలువురిపై జరిపిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలను వెల్లడించింది. స్వదేశీ పరిజ్జానంతో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను ఎంపిక చేసిన ఎడుగురు వ్యక్తులు మూడో డోస్ ఇచ్చి, అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించింది. మూడో డోసు తీసుకున్న వ్యక్తుల్లో ఎంత కాలం రోగ నిరోధక శక్తి ఉంటుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత మూడో డోసు అందించినట్లు తెలిపారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఎంపిక చేసినట్లు ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ అధ్యయన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సత్యజిత్ మోహపాత్రా తెలిపారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, పాట్నా, హైదరాబాద్ తోసహా ఎనిమిది వేర్వేరు ప్రాంతాలకు చెందిన 190 మందిని ఎంపిక చేసి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఎస్ఆర్ఎం హస్పిటల్ పరిధిలో 20 నుంచి 25 మందికి మూడో డోసు అందించామని తెలిపారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న పాల్గొనేవారిని వచ్చే ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తామని ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సత్యజిత్ మోహపాత్రా తెలిపారు. “బూస్టర్ మోతాదును స్వీకరించిన తరువాత ఒకటి, మూడు నుంచి ఆరు నెలల తర్వాత వారి రక్త నమూనాలను సేకరించి భద్రత రోగనిరోధక శక్తి కోసం పరీక్షిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

బూస్టర్ మోతాదు రోగనిరోధక శక్తిని గుర్తుంచుకోవడానికి, జీవితకాల రోగనిరోధక శక్తిని ఇవ్వడానికి తగినంత దీర్ఘకాలిక మెమరీ కణాలు లేదా ప్లాస్మా కణాలను ప్రేరేపిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇది దశ -2 ప్రయత్నాల కొనసాగింపు” అని ఆయన అన్నారు. ఫేజ్ -2 ట్రయల్స్ సమయంలో ఇమ్యునోజెనిసిటీని పెంచడానికి ఇమ్యునోమోడ్యులేటర్ అయిన ఆల్గెల్-ఐఎమ్‌డిజి కలిగిన 6 ఎంసిజి కోవాగ్జిన్ అందుకున్నవారు బూస్టర్ మోతాదును తీసుకున్నారు. “అధ్యయనం మంచి ఫలితాలను ఇస్తే, 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల వ్యాక్సిన్ అందుకున్న వ్యక్తి, వారికి జీవితకాల రోగనిరోధక శక్తిని ఇవ్వడానికి రెండవ మోతాదు తర్వాత నాలుగు నుండి ఆరు నెలల వరకు బూస్టర్ మోతాదును అందుకుంటారు” అని మోహపాత్రా తెలిపారు.

ఇటీవల, కోవాగ్జిన్ తీవ్రమైన కోవిడ్ -19 వ్యాధికి వ్యతిరేకంగా 78% క్లినికల్ సామర్థ్యాన్ని కలగి ఉంటుందని ఆ సంస్థనే వెల్లడించిందని, “కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సంబంధించి పూర్తి సమర్థత ఫలితాలు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. “భవిష్యత్తులో అంటువ్యాధుల విషయంలో మెరుగైన రక్షణాత్మకత కోసం శరీరంలో బలమైన మెమరీ టి కణాలను రూపొందించడానికి మూడవ మోతాదు సహాయపడుతుందో లేదో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు సహాయపడుతాయని” ఆయన వివరించారు.

ఇదిలావుంటే, ‘రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత మూడో డోస్‌ ఇవ్వాలని ఔషధ తయారీ సంస్థలు భావిస్తే, ఇమ్యూనోలాజికల్‌ మెమొరీ డేటాపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోస్‌ల తర్వాత శరీరంలో యాంటీబాడీల పరిస్థితి ఏంటన్నదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఔషధ సంస్థలు మూడో డోస్‌ తీసుకోవాలని సూచించడం నన్ను ఆశ్చర్య పరిచింది. డిసెంబరు 2019లో కరోనా భారత్‌లో ప్రవేశించింది. 2020 ఏప్రిల్‌-ఆగస్టు మధ్య వాక్సిన్‌ తయారీని మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించి మన దగ్గర సరైన గణాంకాలు లేవు. పూర్తి అధ్యయనం చేయడకుండా మూడో డోస్‌ ఇవ్వడంపై అధ్యయనం జరగాల్సి వుంది. అందుకు ఇంకా సమయం పడుతుంది’’ అని ఐసీఎంఆర్‌ నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ సమిరన్‌ పండా అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ మహమ్మారికి స్వస్తి పలకాలని ప్రపంచ ఆశలు రోగనిరోధకతపై పిన్ చేయబడినప్పటికీ, వ్యాక్సిన్ల ద్వారా అందించబడిన రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో ఇంకా తెలియదు. కరోనావైరస్‌లకు వ్యతిరేకంగా పొందిన రోగనిరోధక శక్తి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అధ్యయనాలు ఇప్పటికే చూపించాయి. రెండో డోసు తీసుకున్నవారిలోనూ కోవిడ్ పాజిటివ్ రావడం వంటి కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాలకు కేంద్ర బిందువు అయింది హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad