BSNL New Offer: ఒకప్పుడు టెలికామ్ రంగంలో ఓ వెలుగు వెలిగింది ప్రముఖ
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. దేశానికి తొలిసారి ఫోన్ను పరిచయం
చేసింది ఈ కంపెనీనే. ఒకప్పుడు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ కనెక్షన్ రావాలంటే
కనీసం మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కాలక్రమేణ పోటీ
పెరగడంతో బీఎస్ఎన్ఎల్ తన ప్రాబల్యం కోల్పోతూ వచ్చింది. బడా కంపెనీలు
టెలికాం రంగంలోకి రావడం తక్కువ ధరకే సేవలను అందుబాటులోకి తీసుకురాడంతో ఈ
పోటీలో బీఎస్ఎన్ఎల్ వెనకబడింది.
ఇదిలా ఉంటే తాజాగా రకరకాల ఆఫర్లను తీసుకొస్తూ మళ్లీ రేసులో నిలవడానికి
ప్రయత్నాలు చేస్తోందీ ప్రభుత్వ రంగ సంస్థ. ఈ క్రమంలోనే తాజాగా మరో సూపర్
రీచార్జ్ ఆఫర్తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రూ. 108తో
రీచార్జ్ చేసుకున్న వారికి 60 రోజుల పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను
ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు 28 రోజుల
వ్యాలిడీటీతో రోజుకు 1జీబీ డేటా అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే
రీచార్జ్ మొత్తం కూడా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే ఎక్కువేనని చెప్పాలి.
కానీ బీఎస్ఎన్ఎల్ కేవలం రూ.108 రూపాయాలకే ఈ ఆఫర్న్ అందిస్తుండడం
విశేషం. ఇక ఈ ఆఫర్తో 1జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా
500 ఎస్ఎమ్ఎస్లు అందించనున్నారు. అయితే ఈ కొత్త ప్యాక్ ప్రస్తుతానికి
ఢిల్లీ, ముంబయి ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలో లభిస్తోంది. త్వరలోనే
దేశమంతా అందుబాటులోకి తీసుకువాస్తారని తెలుస్తోంది.
BSNL New Offer: దూకుడు పెంచుతోన్న బీఎస్ఎన్ఎల్… ఎయిర్ టెల్, జియో కంటే మెరుగైన ఆఫర్.. రూ.108 రీచార్జ్తో..
April 04, 2021
0