Trending

6/trending/recent

Half Day Schools: ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు : మంత్రి ఆదిమూలపు సురేష్

  • ఏప్రిల్ 1వ తేదీ నుండి ఒంటి పూట బడులు
  • ఉదయం 7.45 నుండి 11.30 వరకు తరగతులు
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని... ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని.. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు చేపట్టాలన్నారు. తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad