Trending

6/trending/recent

Android Mobile: మీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నారా..? అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..!

Android Mobile: ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడే వారు ఇది కచ్చితంగా చదవాల్సిందే. గత కొన్ని రోజులుగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై కొత్త మాల్‌వేర్‌ దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ కొత్త మాల్‌వేర్‌ ఇతర మాల్‌వేర్‌కన్నా మరింత భయంకరంగా తన ప్రతాపాన్ని చూపనుందని కనుగొన్నారు. సిస్టమ్‌ ఆప్‌డేట్‌ ముసుగులో గోప్యంగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో కనిపించకుండా ఉంటుంది. ప్రముఖ మొబైల్‌ సెక్యూరిటీ కంపెనీ ‘జింపెరియం’ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. ఈ కొత్త మాల్‌వేర్‌ సిస్టమ్‌ ఆప్‌డేట్‌గా చూపిస్తుందని తెలిపారు. ఈ మాల్‌వేర్‌ను గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఒకసారి ఈ మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యాక మొత్తం మొబైల్‌ ఫోన్‌ను తన కంట్రోల్లోకి తీసుకొని కేవలం డేటానే కాకుండా ఇతర సమాచారాన్ని, ఫోటోలను, మెసేజ్‌లను తస్కరిస్తుందని పేర్కొన్నారు. ఒకసారి మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత హ్యాకర్లు డేటాను తమ అదుపులోకి తెచ్చుకుంటారు. అంతేకాకుండా ..మొబైల్‌ కాల్‌ డేటా, మెసేజ్‌లు, డిఫాల్డ్‌గా ఉన్న బ్రౌజర్‌ సమాచారాన్ని జీపీఎస్‌ లోకేషన్‌ను హ్యాకర్లు ట్రాక్‌ చేయనున్నారు. జింపెరియం కంపెనీ సీఈవో శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఈ మాల్‌వేర్‌ మిగతా వాటికంటే చాలా ప్రమాదకరమని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్‌వేర్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో లేకపోవడం ఒకింత మంచిదేనంటున్నారు. ఇతన థర్డ్‌ పార్టీ ఆండ్రాయిడ్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తే మొబైల్‌లలో వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు టెక్‌ నిపుణులు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad