- ఆదివారం..కథా సమయం
- గ్రంథాలయాల్లో విద్యార్థులతో సామూహిక పఠనం
- 3-9 తరగతుల వారిలో నైపుణ్య పెంపుదలే లక్ష్యం
సన్నద్ధమిలా..
●స్థానికంగా ఉండే గ్రంథాలయాలు, పుస్తక కేంద్రాల్లో (బుక్ డిపాజిట్ కేంద్రాలు) కాలనీలు, వీధుల్లో లేదా వార్డుల్లో సామూహిక పఠన సమావేశాలు నిర్వహించాలి.
● గ్రంథ పాలకుడు, సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకుడు, వాలంటీర్లతో ప్రధానోపాధ్యాయుడు సమావేశం ఏర్పాటు చేయాలి.
● స్థానికంగా ఉన్న 3 నుంచి 9 తరగతుల విద్యార్థులను సమావేశ పరచి ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య కార్యక్రమం కొనసాగించాలి.
● ఆదివారం కథా సమయంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ప్రోత్సహించాలి.
● స్థానిక గ్రంథాలయం నుంచి వీలైనంత వరకు బాలసాహిత్యం విభాగానికి చెందిన కథల పుస్తకాలను ఎంపిక చేసుకుని గ్రంథ పాలకుడు, విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్లలో ఒకరిని కథలను చదివేందుకు ఎంపిక చేయాలి. కథను చదివి వివరించిన తరువాత విద్యార్థులంతా అదే కథను పఠించాలి.
WE LOVE READING STORY TIME