Trending

6/trending/recent

ఐదు వర్సిటీలకు వీసీల నియామకం

  • కోర్టు తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు షరతులతో ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, శ్రీవేంకటేశ్వర వర్సిటీకి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి, రాయలసీమ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్‌ ఎ.ఆనందరావు, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి ప్రొఫెసర్‌ ఎం.రామకృష్ణారెడ్డి, ద్రవిడ వర్సిటీకి ప్రొఫెసర్‌ తుమ్మల రామకృష్ణలను ఉపకులపతులుగా నియమించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విశ్వవిద్యాలయాల చట్ట సవరణపై న్యాయస్థానంలో పిల్‌ ఉన్నందున గవర్నర్‌ కార్యాలయం వీసీల నియామక దస్త్రాన్ని పక్కన పెట్టింది. దీనిపై, ఉన్నత విద్యా శాఖ తరఫున అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్‌లోనూ పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad