Trending

6/trending/recent

జగనన్న విద్యాకానుక షూ పంపిణీలో నిర్లక్ష్యం

  • షూ పంపిణీ లో ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం - కమీషనర్
  • అన్నీ సరిగా ఇచ్చేసి నట్టు తప్పుడు నివేదికలు పంపారు - కమీషనర్
అమరావతి: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగనన్న విద్యా కార్యక్రమం సరిగా అమలు కావట్లేదు. ముఖ్యంగా షూ పంపిణీలో ప్రధానోపాధ్యాయులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు అని విద్యాశాఖ కమిషనర్ అభిప్రాయ పడ్డారు. తప్పుడు నివేదిక లతో షూ పంపిణీ సరిగా నే అయినట్లు చూపుతున్నారు అని తెలిపారు. లోటుపాట్లను ముందుగానే అంచనా వేసి అనేక సూచనలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శించారు అని అన్నారు. ఈ మేరకు షూ పంపిణీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రతి దశ లోనూ ప్రధానోపాధ్యాయులు కనబరచిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ దానిని సరి చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఎం.ఈ.ఓ లు కూడా కొలతలు సరిగా లేని, డ్యామేజ్ అయిన షూ లను సేకరించి పునఃపంపిణీ చేయడం లో పూర్తి విఫలం అయ్యారని అన్నారు. ఈ నెల 19, 20 కల్లా షూ పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad