- స్టడీ మెటీరియల్ ను ఇష్టా రాజ్యంగా వాడొద్దు
- సి.సి.ఈ స్ఫూర్తి కి విరుద్ధం
అమరావతి, న్యూస్ టోన్: పాఠశాలల్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రైవేట్ స్టడీ మెటీరియల్ ను కానీ, గైడ్ లను వాడటానికి వీల్లేదని ఎస్.సీ.ఆర్.టి డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఇతర మెటీరియల్ వాడటం వలన సి.సి.ఈ విద్యా విధానం స్ఫూర్తి దెబ్బ తింటుందని తెలిపారు. దీనిపై 2014 లోనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పాటించడం లేదని అన్నారు. అన్ని విద్యా సంస్థలలో ఇలాంటి మెటీరియల్ వాడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.