విశాఖపట్నం: ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీల్లో అన్ని ఖాళీలు చూపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజక వర్గ ఎం.ఎల్.సీ శ్రీ రఘు వర్మ కోరారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ కి లేఖ రాశారు. అన్ని ఖాళీలు చూపించక పోవడం వలన కొన్ని పాఠశాలల్లో రెండవ పోస్టు బ్లాక్ అయ్యి పాఠశాలకు ఇద్దరు ఉపాద్యాయులు అనే ప్రభుత్వ ఉద్దేశ్యం నీరుగారుతుందని పేర్కొన్నారు.