Trending

6/trending/recent

కమీషనర్ లేఖకు ఫ్యాప్టో సవివర సమాధానం

  • విద్యాశాఖ కమిషనర్ లేఖ ను తిరస్కరిస్తున్నాం
  • మా పై ఉపాధ్యాయులకు నమ్మకం సన్నగిల్లేలా ఉంది.
  • మేం కోరినవీ ఏవీ మీరు అమలు చేయడం లేదు

అమరావతి, న్యూస్ టోన్: బదిలీలు, రేషనలైజేషన్ కు సంబంధించి విద్యాశాఖ కమిషనర్ తమకు రాసిన లేఖను పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఫ్యాప్టో ప్రకటించింది.ఆ లేఖలోని అంశాలు తమపై ఉపాధ్యాయులకు తమపై విశ్వాసం సన్నగిల్లేలా ఉందని పేర్కొంది. ఆ లేఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేలా లేదని, హామీలను విస్మరించిన ప్రభుత్వమే తమ విశ్వాసం కోల్పోయేలా ఉందని ఫ్యాప్టో ఛైర్మన్ జి.వి.నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ నరహరి పేర్కొన్నారు. కమిషనర్ రాసిన లేఖకు ప్రతిగా అనేక అంశాలను లేవనెత్తుతూ విద్యాశాఖ కమిషనర్ కు తిరిగి ఫ్యాప్టో లేఖ రాసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. 

• జీవో నెంబరు 53లో కటాఫ్ తేదీ కమిషనర్ నిర్ణయిస్తారని ఉంది. ఆ తర్వాత విద్యాశాఖ ఇచ్చిన మెమోలో (13029)లో ఫిబ్రవరి 29 లేదా నవంబరు 2 లలో ఏది ఎక్కువ రోలు అయితే అది పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. అక్టోబరు 27 నాటి చర్చల్లో ఫిబ్రవరి 2ని కొనసాగిస్తూనే అక్టోబరు 14 బదులు 31 పరిగణనలోకి తీసుకోవాలని ఫ్యాప్టో కోరింది. ఈలోపు తల్లిదండ్రలు డిక్లరేషన్ తోనే ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునేందుకు అనుమతించారు. చైల్డ్ ఇన్ ఫోలో వారిని చేర్చే అవకాశం వచ్చింది. ఫ్యాప్టో కమిషనర్ వద్ద ఉన్నప్పుడు డ్రాప్టు ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. కానీ మెమోలో మళ్లీ నవంబరు 2 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. చైల్డ్ ఇన్ ఫో లో మీడియం ఆప్షన్ సరి చేయని కారణంగా అనేక పాఠశాలలు తీవ్రంగా నష్టపోతున్న విషయం నిజం కాదా? దీనిపై ఫ్యాప్టో తన లేఖ ద్వారా ఖండించింది నిజం కాదా? 

• వెబ్ కౌన్సెలింగు పట్ల ఎస్ జీ టీలు ఎన్ని వేల ఆప్షన్లు ఎంచుకోవాలో అది ఎంత కష్టమో అదికారులు గుర్తించి మాన్యువల్ కౌన్సెలింగుకు అవకాశం ఇవ్వాలి. నవంబరు 10 లోపు డెమో నిర్వహిస్తామన్నారు. డెమో నిర్వహిస్తే దాన్ని కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాన్యువల్ కౌన్సెలింగు మాత్రమే ఫ్యాప్టోకు సమ్మతం.

• 2015, 2017 బదిలీల్లో 5 పూర్తి సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులకు చూపారు. 2020 లో అది 5 అకడమిక్ సంవత్సరాలుగా మార్చారు. ఫ్యాప్టో ముందు నుంచి 5 పూర్తి సంవత్సరాలు కోరుతోంది. 5 సంవత్సరాలకు ఇక నెలా 17 రోజులే వ్యత్యాసం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఫ్యాప్టో వ్యత్యాసం గురించి మాట్లాడటం లేదు. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగుతుందనే ఉద్దేశంతనే ఫ్యాప్టో 5 పూర్తి సంవత్సరాలపై పట్టు పడుతోంది. కొందరు ప్రధానోపాధ్యాయులు 5 సంవత్సరాలు జీవో ప్రకారమే తీసుకోవాలని కోరి ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు నాయకత్వం వహించే ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతిపాదనలు, ఫ్యాప్టో ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తిగతంగా కొందరు పంపే మెస్సజిలను పరిగణనలోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని ఫ్యాప్టో ప్రశ్నించింది. 

• కేటగిరి 1, 2 లో ఖాళీలను సిఫార్సు బదిలీలకు వదిలేయడం, కొన్ని ఖాళీలు బ్లాక్ చేయడం సరికాదని ఫ్యాప్టో ఎప్పటి నుంచో చెబుతోంది. ఇందుకు కమిషనర్ తన లేఖలో ఉపాధ్యాయులంతా తమకు కావాల్సిన కీలక స్థానాలకు వెళ్లిపోవడం వల్ల వెనుకబడిన తరగతుల పిల్లలు చదివే పాఠశాలలు, ఇతర చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ గా ఉండిపోతున్నాయని, అందువల్లే వాటిని బ్లాక్ చేశామని చెబుతున్నారు. నిజానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టలను భర్తీ చేయనంత కాలం ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. అందరూ కేటగిరి 1, 2 లకే బదిలీ కోరతారనేది అవాస్తవవం. కేటగిరీ, 3, 4 లలో కూడా కొందరు ఉపాధ్యాయులు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సిఫార్సు బదిలీలను ఫ్యాప్టో ఎత్తి చూపితే కమిషనర్ కు ఆగ్రహం వచ్చింది. వారు చేసిన సిఫార్సు బదిలీల్లో సామాజిక కోణంలో ఎన్ని బదిలీలు జరిగాయో ఎంత మంది 3,4 కేటగిరీలకు జరిగాయో చెప్పాలి . వారు చేసిన బదిలీలు అన్నీ మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు జరిగినవే. ఇదేనా పేదల పట్ల అధికారులకు ఉన్న బాధ్యత అని ఫ్యాప్టో ప్రశ్నించింది.

• సిఫార్సు బదిలీలన్నీ కేటగిరీ 1, 2లలో పొందినవే కదా , మళ్లీ వాటిని బ్లాక్ చేస్తే ఎలా అని ఫ్యాప్టో ప్రశ్నించింది. 

• సర్వీసు పాయింట్లపై సీలింగు ఎత్తివేయాలని, పాయింట్లు ఏడాదికి ఒకటి చొప్పున ఇవ్వాలని కోరినా పరిగణనలోకి తీసుకలేదు అని ఫ్యాప్టో ప్రస్తావించింది. 

• పదవీ విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్నవారిని బదిలీల నుంచి మినహాయించాలని కోరామని ఫ్యాప్టో పేర్కొంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad