Trending

6/trending/recent

టెన్త్‌ విద్యార్థినులకు సీపీ బ్రౌన్‌-ఎస్పీబీ తెలుగు పోటీ

న్యూస్ టోన్, అమరావతి: తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి బాలికలకు సీపీబ్రౌన్‌-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పోటీ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపారు. విద్యార్థుల్లో మాతృభాష మీద ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 13న పోటీ ఉంటుందని, 20న విజేతలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad