Trending

6/trending/recent

కరోనా థర్డ్ వేవ్ తస్మా త్ జాగ్రత్త

  • కోవిడ్ విజృంభణపై నిపుణుల హెచ్చరికలు
  • 40వేలకు పైగానే రోజువారి కొత్త కేసులు

న్యూస్ టోన్, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో కోవిడ్ విజృంభణపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. థర్వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కొద్దివారాల పాటు వైరస్ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐదు వారాల కిందట ఢిల్లీలో పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, ప్రస్తుతం తీవ్రత తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ముప్పు తొలగిపోయినట్లు భావించడానికి వీల్లేదని వైద్యలు వెల్లడిస్తున్నారు అక్టోబర్ లో రెండోదశ ముగిసింది. నవంబర్ మధ్యలో మూడో దశ మొదలైందని నోయిడాలోని ఫార్టీస్ హెల్త్ కేర్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ అగర్వాల్ చెప్పారు. మూడోదశలో శ్వాసకోశ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఊపిరి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కోవిడ్ తర్వాత మరిన్ని సంక్లిష్టతలు కలుగుతున్నాయని చెప్పారు. బుధవారం సాయంత్రం నాటికి ఢిల్లీలో మొత్తంగా 5,45,787 పాజిటివ్ లు, 8,720 మరణాలు నమోద య్యాయి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad