Trending

6/trending/recent

ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులకు బదిలీ

న్యూస్ టోన్, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల నిబంధనలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు ఒకటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గతంలో 5 అకడమిక్‌ సంవత్సరాలు ఉండగా.. దానిని ఐదేళ్లుగా మార్పు చేసింది. ప్రస్తుత పాఠశాలలో ఎన్నేళ్లు పని చేస్తే అన్ని స్టేషన్‌ పాయింట్లు ఇస్తారు. గతంలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు పరిమితి విధించగా.. పని చేసిన కాలానికి పూర్తిగా పాయింట్లు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా వీటిని 16.5 పాయింట్లుగా మార్పు చేసింది. 33 ఏళ్ల వరకు సర్వీసుకు పాయింట్లు కేటాయిస్తారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad