Trending

6/trending/recent

5న ట్రిపుల్ ఐటీ సెట్

  • నివర్ తుపాన్ దృష్ట్యా వాయిదా

అమరావతి, న్యూస్ టోన్: రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే సెట్ 'నివర్' తుపాను కారణంగా వాయిదా పడింది. ఈ శనివారం(28)న నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆర్ జీయూకేటీ కన్వీనర్ డి. హరినారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే తుపాను ప్రభావం ఐదు జిల్లాల్లో తీవ్రంగా ఉండటంతో వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ హరినారాయణ, చైర్మన్ ప్రొ. కె. హేమచంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ ఐదున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే ప్రకటించిన పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పులు లేవని, హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నవి తెచ్చుకోవచ్చని సూచించారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగా విద్యార్థులు చేరుకోవాలని తెలిపారు. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad